సీఎం సభకు మహిళలకు ప్రత్యేక బస్సులు : ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

సీఎం సభకు మహిళలకు ప్రత్యేక బస్సులు : ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

నారాయణపేట, వెలుగు:  మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌‌‌‌ లో జరిగే సీఎం సభకు నారాయణపేట నియోజకవర్గం నుంచి మహిళలను పెద్ద ఎత్తున తీసుకురావాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కోరారు.  మంగళవారం క్యాంప్​ కార్యాలయంలో నారాయణపేట, ధన్వాడ, మరికల్​, దామరగిద్ద మండలాల ఐకేపీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభ కోసం మహిళలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు. దామరగిద్దలో రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు.